అంబేద్కర్ బాటలో టీడీపీ
ABN , First Publish Date - 2020-11-27T05:27:28+05:30 IST
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో టీడీపీ పయనిస్తుందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు.
గుంటూరు(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో టీడీపీ పయనిస్తుందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో యరమాల విజయ్కిరణ్, కంచర్ల శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు, కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.