ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2022-07-06T05:22:58+05:30 IST
వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఆకుకూరల నుంచి బస్సు చార్జీల వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి అన్నారు.
తాడేపల్లిగూడెం అర్బన్, జూలై 5: వైసీపీ అధికారం చేపట్టిన తరువాత ఆకుకూరల నుంచి బస్సు చార్జీల వరకు అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి అన్నారు. పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని స్థానిక బస్టాండ్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. చార్జీల బాదుడు వివరిస్తూ ప్రయాణికులకు కరపత్రాలను పంపిణీ చేసి, బస్సులను శుభ్రం చేశారు. కార్యక్రమానికి పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షత వహించగా బాబ్జి మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల పాటు ప్రజలపై భారం పడకుండా ఆర్టీసీని కాపాడారని, వైసీపీ ప్రభు త్వం మూడు సార్లు చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని బారాన్ని మోపిందన్నారు. నాయకులు గొర్రెల శ్రీధర్, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్చౌదరి, మద్దిపాటి ధర్మేంద్ర, పోతుల అన్నవరం తదితరులు పాల్గొన్నారు.