Americaలో 20, 21న టీడీపీ మహానాడు
ABN , First Publish Date - 2022-05-16T21:22:45+05:30 IST
అమెరికాలోని బోస్టన్ బెస్ట్ వెస్ట్రన్ రాయల్ ప్లాజా హోటల్లో ఎన్నారై టీడీపీ, యూఎస్ఏ ఆధ్వర్యంలో ఈనెల
అమరావతి: అమెరికాలోని బోస్టన్ బెస్ట్ వెస్ట్రన్ రాయల్ ప్లాజా హోటల్లో ఎన్నారై టీడీపీ, యూఎస్ఏ ఆధ్వర్యంలో ఈనెల 20, 21 తేదీల్లో మహానాడు (Mahanadu)ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ (Facebook) యూట్యూబ్ లైవ్లో ప్రసారం చేస్తారు. అమెరికాలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. 50వేల మందిని సభ్యులుగా చేర్చాలని ప్రవాస టీడీపీ నేతలు లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
బోస్టన్ మహానాడుతో ప్రారంభించి ఏడాది పొడవునా వివిధ నగరాల్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహిస్తామని ప్రవాస టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏడాది పొడవునా అమెరికాలో జరిగే ఉత్సవాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర సీనియర్ నేతలు పాల్గొనే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు కూడా శత జయంతి వేడుకల్లో చురుకుగా పాల్గొనే విధంగా మహిళా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.