ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2022-01-20T02:21:06+05:30 IST

పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి

ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: అచ్చెన్నాయుడు

అమరావతి: పీఆర్సీ కోసం ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న న్యాయ పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వైసీపీ అసమర్థత, అవినీతి దుబారానే రాష్ట్రానికి శాపమన్నారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గిందని దేశంలో ఏ ఒక్క రాష్ట్రం జీతాలు తగ్గించ లేదన్నారు. రివర్స్ పాలనలో ఐఆర్ కన్నా తగ్గించి ఇవ్వడం చరిత్రలో మొదటసారి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణతో పోల్చినా, గత సంవత్సరంతో పోల్చినా రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఆయన తెలిపారు.  


Updated Date - 2022-01-20T02:21:06+05:30 IST