పార్టీని బలోపేతం చేయాలి
ABN , First Publish Date - 2021-01-17T04:26:55+05:30 IST
రాబోయే రోజుల్లో టీడీపీని బలోపేతం చేయడానికి యువత చురుగ్గా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు.
టీడీపీ కార్యకర్తలకు డాక్టర్ ఉగ్ర పిలుపు
వెలిగండ్ల, జనవరి 16: రాబోయే రోజుల్లో టీడీపీని బలోపేతం చేయడానికి యువత చురుగ్గా పనిచేయాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని నాగిరెడ్డి పల్లిలో టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీ అండ చూసుకొని కార్యకర్తలపై దౌర్జన్యాలు, దాడులు చేస్తే సహించేది లేదని తెలిపారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన స్వర్గీయ ఎన్టీయార్ వర్ధంతి సందర్భంగా కనిగిరి పట్ణంలోని స్థానిక బీఎస్ఎన్ఎల్ ఆఫీసు ఎదురుగా ఉన్న అమరావతి గ్రౌండ్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు శ్యామల కాశిరెడ్డి, దొడ్డా వెంకట సుబ్బారెడ్డి, బీరం వెంకటేశ్వరరెడ్డి, సాల్మన్రాజు, నాగిరెడ్డిపల్లి గ్రామ పార్టీ అధ్య క్షుడు గిద్దా గురుస్వామి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి, కీలం ఇంద్రభూపాల్రెడ్డి, రమ ణయ్య, దేసిరెడ్డి, రత్తయ్య, మాజీ సర్పంచ్లు మనోహర్, గాలిరెడ్డి, బద్దిపూడి లోకయ్య తదితరులు పాల్గొన్నారు.
రేపు రక్తదాన శిబిరం
పీసీపల్లి : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న కనిగిరిలోని అమ రా వతి గ్రౌండ్స్లో ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహి స్తున్న ట్లు టీడీపీ మండల నాయకులు వీరపునేని పెద్దన్న, వేమూరి రామయ్య, మూలె చెంచిరెడ్డి తెలిపారు. రక్తదాన శిబిరంలో టీడీపీ సైనికులు పాల్గొని కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
దర్శిలో..
దర్శి : టీడీపీ వ్యవస్థాకుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని దర్శిలో సోమవారం నిర్వహిస్తున్నట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పమిడి రమేష్ తెలిపా రు. స్థానిక పీజీఎన్ క్లబ్ ఆవరణలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగు పా ల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.