మైదుకూరు రెండో వార్డు టీడీపీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-03-09T10:02:25+05:30 IST
వైసీపీ నాయకుల బెదిరింపులు కారణంగా కడప జిల్లా మైదుకూరు రెండో వార్డు శెట్టివారిపల్లె టీడీపీ అభ్యర్థి కంచెల బాలయ్య (54)
వైసీపీ నేతల బెదిరింపుల వల్లేనని కుటుంబ సభ్యుల ఆరోపణ
కడప, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుల బెదిరింపులు కారణంగా కడప జిల్లా మైదుకూరు రెండో వార్డు శెట్టివారిపల్లె టీడీపీ అభ్యర్థి కంచెల బాలయ్య (54) సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రచారం ముగించుకుని మైదుకూరుకు వచ్చి ఇంటికి వెళ్లకుండా నానుబానుపల్లె పొలాల్లో పురుగుల మందుతాగి భార్య, కుమారుడికి ఫోన్ చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న బాలయ్యను స్థానిక ఆస్పత్రికి.. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైసీపీ నాయకుడు శ్రీమన్నారాయణరెడ్డి, అతడి అనుచరులు బెదిరించడం వల్లే మనస్తాపంతో తన తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడని బాలయ్య కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.