కోవూరులో వారసుడికి టీడీపీ చాన్స్‌

ABN , First Publish Date - 2022-10-01T09:58:37+05:30 IST

Polam Reddy Dinesh Reddy

కోవూరులో వారసుడికి టీడీపీ చాన్స్‌

పార్టీ ఇన్‌చార్జిగా పోలంరెడ్డి దినేశ్‌ రెడ్డి


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పోలంరెడ్డి దినేశ్‌ రెడ్డిని ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకొన్నారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆయన తండ్రి. ఇప్పటివరకు శ్రీనివాసుల రెడ్డి ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా ఉన్నారు. శ్రీనివాసుల రెడ్డితో శుక్రవారం సమావేశం అనంతరం చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి పులవర్తి నాని, బాపట్ల ఇన్‌చార్జి వేగేశ్న నరేంద్ర వర్మతో కూడా చంద్రబాబు శుక్రవారం సమావేశమయ్యారు. 

Updated Date - 2022-10-01T09:58:37+05:30 IST