టీడీపీలో 50 కుటుంబాల చేరిక

ABN , First Publish Date - 2022-07-24T00:54:45+05:30 IST

జిల్లాలోని అరకులోయ మండలం చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామస్తులు టీడీపీలో చేరారు. సుమారు 50 కుటుంబాల వారు మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు.

టీడీపీలో 50 కుటుంబాల చేరిక

అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని అరకులోయ మండలం చొంపి పంచాయతీ పప్పుడువలస గ్రామస్తులు టీడీపీలో చేరారు. సుమారు 50 కుటుంబాల వారు మాజీమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా కిడారి శ్రావణ్ మాట్లాడుతూ... టీడీపీ హయాంలోనే గిరిజనాభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో మన ప్రభుత్వమే ఏర్పడుతుందని కిడారి జోస్యం చెప్పారు. గ్రామ స్థాయి నుండి ప్రజల్లో చైతన్యం రావాలని, ప్రజా సమస్యలపై కార్యకర్తలే పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-24T00:54:45+05:30 IST