చికాగోలో ఆలపాటి రాజాతో ప్రవాసాంధ్రుల మీట్ అండ్ గ్రీట్

ABN , First Publish Date - 2022-04-11T22:56:42+05:30 IST

చికాగోలో ప్రవాసాంధ్రులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమావేశమయ్యారు.

చికాగోలో ఆలపాటి రాజాతో ప్రవాసాంధ్రుల మీట్ అండ్ గ్రీట్

టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం: ఆలపాటి

చికాగోలో ప్రవాసాంధ్రులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సమావేశమయ్యారు. చికాగోలోని ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం సభ్యులు దాదాపు 150 మందికి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. స్థానిక తెలుగు ప్రముఖులు మదన్ పాములపాటితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం నాయకుల చొరవతో ఈ సమావేశం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ఆలపాటి అందరికి వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ని ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించే సామర్ధ్యం చంద్రబాబుకే ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం మేలు కోసం వచ్చే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు కూడా టీడీపీ విజయానికి సహకరించాలని ఆలపాటి కోరారు.


ఈ సమావేశంలో చికాగోలోని ఎన్.ఆర్.ఐ టీడీపీ నాయకులు వెంకట్ యలమంచిలి, శ్రీనివాస్ పిడికిటి, మహేశ్ కాకర్ల, హేమ కానురు, శ్రీనివాస్ పెదమల్లు, సందీప్ ఎల్లంపల్లి, పండు చెంగలశెట్టి, రాజేశ్ వీడులమూడి, మనోహర్ పాములపాటి, శ్రీనివాస్ బొప్పన, వేణు కృష్ణార్ధుల, కృష్ణ నున్న, కృష్ణ నిమ్మగడ్డ, మూర్తి కొప్పాక తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.









Updated Date - 2022-04-11T22:56:42+05:30 IST