29న గుడివాడలో Chandrababu పర్యటన.. సభా స్థలాలను పరిశీలించిన Ravindra

ABN , First Publish Date - 2022-06-22T16:59:14+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఈనెల 29న గుడివాడలో పర్యటించనున్నారు.

29న గుడివాడలో Chandrababu పర్యటన.. సభా స్థలాలను పరిశీలించిన Ravindra

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ఈనెల 29న గుడివాడలో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే మినీ మహానాడులో టీడీపీ అధినేత పాల్గొంటారు. ఈ క్రమంలో చంద్రబాబు బహిరంగ సభకు స్థలాలను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu ravindra), టీడీపీ నేతలు బుధవారం ఉదయం పరిశీలించారు.  గుడ్లవల్లేరు, గుడివాడ మండలాల్లో నాలుగు ప్రాంతాలను రవీంద్ర పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లక్షలాది మందితో గుడివాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. సాయంత్రానికి బహిరంగ సభ ప్రాంతాన్ని ప్రకటిస్తామన్నారు. చంద్రబాబు బహిరంగ సభలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 30న మచిలీపట్నంలోని ఓ కళ్యాణ మండపంలో కృష్ణాజిల్లా టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం అవుతారని కొల్లు రవీంద్ర వెల్లడించారు. 

Updated Date - 2022-06-22T16:59:14+05:30 IST