వెంకన్నను అపవిత్రం చేస్తున్నారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-02-25T00:06:48+05:30 IST
భక్తుల ఇలవేల్పు తిరుమల వెంకన్నను అపవిత్రం చేస్తున్నారని టీడీపీ
అమరావతి: భక్తుల ఇలవేల్పు తిరుమల వెంకన్నను అపవిత్రం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీకి చెందిన సర్పంచ్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తూ సేవా టిక్కెట్ల ధరలు పెంచేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. భక్తులను వెంకన్నకు దూరం చేయాలనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. వెంకన్న పవర్ను తగ్గించాలని చూస్తున్నారా అని ఆయన నిలదీశారు. టీడీపీ సమస్యలని ప్రస్తావిస్తే.. వైసీపీ బూతులు తిడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిట్టడం తనకు రాదన్నారు. ప్రత్యర్ధులు బూతులు తిడితే టీడీపీ కూడా తిట్టాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు ఆయన సూచించారు.