రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి మృతికి చంద్రబాబు సంతాపం
ABN , First Publish Date - 2022-02-28T13:59:31+05:30 IST
రాజకీయ కురువృద్ధులు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు.
అమరావతి: రాజకీయ కురువృద్ధులు, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందని అన్నారు. రాష్ట్ర మంత్రిగా, జడ్పీ చైర్మన్గా, రాజ్యసభ సభ్యునిగా పని చేసిన ఆయన తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చారని పేర్కొన్నారు. యడ్లపాటి జీవితం ప్రతీతరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని టీడీపీ అధినేత అభిప్రాయపడ్డారు. యడ్లపాటితో తనకు ఉన్న అనుబంధాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. టీడీపీ సీనియర్ నేత కుంటుంబ సభ్యులకు బాబు సానుభూతి తెలియజేశారు. వెంకట్రావు ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రబాబు ప్రార్థించారు.