Chandrababu naidu: గోదావరి వరద ప్రాంతాల్లో పర్యటనకు బయలుదేరిన చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-28T16:29:27+05:30 IST
పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు.
అమరావతి: పోలవరం విలీన మండలాలలోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఏపీ(AP)లోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలలోని శివకాశీపురం, కుక్కునూరులలో పర్యటించనున్నారు. అలాగే తెలంగాణ (Telangana) రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్లో ముంపు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం పర్యటించనున్నారు. రాత్రికి భద్రాచలం(Bhadrachalam)లో చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఎటపాక, కూనవరం, వీఆర్పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.