Chandrababu Tweet: వర్షాలకు రోడ్లు పాడవడం కొత్త కాదు... కానీ: టీడీపీ చీఫ్
ABN , First Publish Date - 2022-07-28T16:35:15+05:30 IST
రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదకిగా విరుచుకుపడ్డారు.
అమరావతి: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) ట్విట్టర్ వేదకిగా విరుచుకుపడ్డారు. వర్షాలకు రోడ్లు పాడవడం కొత్త కాదు... కానీ, ప్రజల ప్రాణాలు తీసే వరకు వాటిని బాగు చేయకపోవడం మాత్రం క్షమించరాని నేరమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముదునూరులో ప్రవీణ్ కుమార్ అనే యువకుడు బైక్ మీద వెళ్తూ రావికుంట దగ్గర రోడ్డుపై ఉన్న గొయ్యి కారణంగా దుర్మణం చెందడం బాధాకరమని తెలిపారు. దక్షిణాఫ్రికా (South Africa)లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసేందుకు వచ్చి వారం రోజుల్లో తిరిగి వెళ్ళిపోతాడనగా... ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం అతన్ని తిరిగిరాని లోకాలకు పంపించేసిందన్న వార్త మనసును కలచివేసిందని ఆవేదనచెందారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలకు బాధ్యతగా నిలవాలని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.