ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం: Chandrababu

ABN , First Publish Date - 2021-11-25T16:00:05+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి అహంకారం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం: Chandrababu

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి అహంకారం ప్రజలకు శాపంగా మారిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు పడతాయని ముందే తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని... ప్రభుత్వ బాధ్యతరాహిత్యం వల్లే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సమంయలోనే ప్రభుత్వ సమర్థత ఏమిటో తెలుస్తుందన్నారు. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టులపై ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారని ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్ట్‌కు గేట్లు పెట్టేందుకు కూడా డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. అన్నమయ్య, పింఛ ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారన్నారు. మృతదేహం కూడా దొరకలేదంటే ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆగ్రహించారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావని.. సమర్థతతో పనిచేయాలని హితవుపలికారు. సమర్థతతో వ్యవహరిస్తే ప్రాణనష్టాన్ని తగ్గించవచ్చని చంద్రబాబు తెలిపారు. 

Updated Date - 2021-11-25T16:00:05+05:30 IST