నారావారిపల్లెలో Chandrababuకు చెందిన భూమి కబ్జాకు యత్నం

ABN , First Publish Date - 2022-02-18T16:30:09+05:30 IST

ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి.... రాజకీయాల్లో తలపండిన నేత... దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత చంద్రబాబుకు కబ్జాదారులు షాక్ ఇచ్చారు.

నారావారిపల్లెలో Chandrababuకు చెందిన భూమి కబ్జాకు యత్నం

తిరుపతి: ఒకప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి.... రాజకీయాల్లో తలపండిన నేత... దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన నేత చంద్రబాబుకు కబ్జాదారులు షాక్ ఇచ్చారు. సొంత ఊరిలోనే బాబుకు చెందిన భూమిని కబ్జాచేసేందుకు కబ్జాదారులు యత్నించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని నారావారిపల్లెలో చంద్రబాబుకు 38 సెంట్ల భూమి ఉంది. ఈ భూమిపై ఇప్పుడు కబ్జాదారుల కన్నుపడింది. ఈ భూమిని ఆక్రమించుకోవడంతో పాటు ఫెన్సింగ్ వేసేందుకు కబ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. 1989లో 87 సెంట్లు చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 87 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. కొంతకాలం తర్వాత ఆస్పత్రి, కళ్యాణమండపానికి కొంతభూమిని చంద్రబాబు వితరణగా ఇచ్చారు. ఇప్పుడు మిగిలిని ఈ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది. చంద్రబాబుకు చెందిన 38సెంట్ల భూమిలో కబ్జాదారులు ఫెన్సింగ్ వేస్తున్నారు. 


వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్థులు కబ్జాను అడ్డుకుంటున్నారు. అయితే ఈ భూమి తమదే అని, తమకే హక్కులు ఉన్నాయని కబ్జాదారులు రాళ్లు నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు కుటుంబీకులు కూడా ఎవరూ ఇంతవరకు రాకపోవడంతో అక్కడి ప్రజలే కబ్జాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏకంగా చంద్రబాబుకు చెందిన భూమినే కబ్జా చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. 


Updated Date - 2022-02-18T16:30:09+05:30 IST