Chittoorలో మూడవరోజు చంద్రబాబు పర్యటన
ABN , First Publish Date - 2022-01-08T17:01:24+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది.
చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన మూడవ రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం కుప్పం ఆర్అండ్బి అతిథిగృహం వద్ద టీడీపీ కార్యకర్తలు, నాయకులు... చంద్రబాబుకు పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాలతో సన్మానించారు. ఆపై కుప్పం నియోజకవర్గ ప్రజల సమస్యలపై బాబుకు వినతి పత్రాలు అందించారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్న టీడీపీ అధినేత... పార్టీ ఆఫీస్ను పరిశీలించారు. అనంతరం కుప్పంలో చంద్రబాబు సొంత నివాసం నిర్మాణ పనులు ప్రారంభించడానికి స్థలం ఎంపిక, పరిశీలన వంటి అంశాలపై నాయకులతో పార్టీ కార్యాలయంలో అధినేత చర్చలు నిర్వహించారు.