మహానాడు ప్రాంగణానికి చేరుకున్న Chandrababu

ABN , First Publish Date - 2022-05-27T16:15:06+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు.

మహానాడు ప్రాంగణానికి చేరుకున్న Chandrababu

ప్రకాశం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. టీడీపీ అధినేత మ‌హానాడు ప్రాంగ‌ణానికి చేరుకోవ‌డంతో జై చంద్రబాబు అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మ‌హానాడులో అన్న‌గారి అభిమానులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీష‌న్‌ను చంద్రబాబు ప్రారంభించారు. 


మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలతో మహానాడు ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పెద్ద ఎత్తున ప్రతినిధులు మహానాడుకు తరలివచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సహా లోకేష్, పార్టీ సీనియర్లు మహానాడు ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రతినిధుల నమోదు, సభ్యత్వ నమోదు, ఫొటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2022-05-27T16:15:06+05:30 IST