స్కూళ్ల ఆస్థులు కొట్టేయడానికే జగన్ కుట్ర: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-06-08T22:55:25+05:30 IST

అమరావతి: విద్యా‌శాఖలోకి మునిసిపల్ స్కూళ్ల విలీనం ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 2115 పాఠశాలలకు చెందిన వేల కోట్ల

స్కూళ్ల ఆస్థులు కొట్టేయడానికే జగన్ కుట్ర: చంద్రబాబు

అమరావతి: విద్యా‌శాఖలోకి మునిసిపల్ స్కూళ్ల విలీనం ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. 2115 పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కొట్టేయ్యడానికే జగన్ కుట్ర చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, స్కూళ్ల విలీన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ విషయంలో మునిసిపల్  టీచర్ల పోరాటానికి టీడీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు. నిన్నటి వరకు ఎయిడెడ్ స్కూళ్లను టార్గెట్ చేసిన ప్రభుత్వం...ఇప్పుడు మునిసిపల్ స్కూళ్ల ఆస్తులపై కన్నేయడం దారుణమన్నారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మునిసిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.  

Updated Date - 2022-06-08T22:55:25+05:30 IST