మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర
ABN , First Publish Date - 2021-01-22T05:23:31+05:30 IST
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని పరిశీలించారు.
మంత్రి అప్పలరాజు
సంతబొమ్మాళి, జనవరి 21: మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. గురువారం సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో నంది విగ్రహాన్ని పరిశీలించారు. విలేకరులతో మాట్లాడుతూ.. సీసీ కెమెరాల్లో నంది విగ్రహం టీడీపీ వారు తరలించిన దృశ్యాలు బయటపడిన తరువాత చంద్రబాబు మాటమార్చారన్నారు. ప్రాణ ప్రతిష్థ జరిగిన నంది విగ్రహాన్ని నడిరోడ్డుపై పెట్టి అపచారానికి పూనుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్, నాయకులు సుగ్గు రామిరెడ్డి, పాల వసంతరెడ్డిలు పాల్గొన్నారు.