YSRCP గూండాలను వదలేసి.. దేవినేనిపై కేసులా: మాజీ ఎమ్మెల్యే గన్ని

ABN , First Publish Date - 2021-07-28T19:32:46+05:30 IST

వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు విమర్శించారు.

YSRCP గూండాలను వదలేసి.. దేవినేనిపై కేసులా: మాజీ ఎమ్మెల్యే గన్ని

ఏలూరు: వైసీపీ పాలనలో అవినీతి, అరాచకం రాజ్యమేలుతున్నాయని  ఏలూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఎన్ని దాడులు చేసి, అరెస్టులు చేసినా రాష్ట్రంలో వైసీపీ నేతల దోపిడిలపై తమ పోరాటం ఆగదన్నారు. భీమడోలు క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. దేవినేని కారుపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని అటవికచర్యగా అభివర్ణించారు. వైసీపీ గూండాలను వదిలేసి దేవినేనిపై, ఆయనతో పాటు దాడిలో గాయపడిన మరో 18 మందిపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఉమాపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు ఏ విధంగా పెడతారని నిలదీశారు. 

Updated Date - 2021-07-28T19:32:46+05:30 IST