టీడీపీ ఫ్లెక్సీల చించివేత
ABN , First Publish Date - 2022-07-06T03:29:09+05:30 IST
స్థానిక టీడీపీ కార్యాలయం వెలుపల, రహదారిపై ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి చించివేశారు.
కలిగిరి, జూలై 5: స్థానిక టీడీపీ కార్యాలయం వెలుపల, రహదారిపై ఉన్న తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి చించివేశారు. ఈ విషయమై టీడీపీ మండల కన్వీనర్ జయరామిరెడ్డి, రావులకొల్లు సర్పంచు పూసల వెంగపనాయుడు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రావులకొల్లు, ఏపినాపి సర్పంచులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీ అడుగుభాగం చించివేశారు. ఫ్లెక్సీ పైభాగాన చంద్రబాబు, బొల్లినేనిని ఉంచారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకుౖ కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు ఎస్ఐ సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. అయితే స్థానిక హెచ్పీ పెట్రోల్ బంకు, బ్యాంక్ బరోడా సీసీటీవీ పుటేజీలను పరిశీలించగా అర్థరాత్రి 11గంటల సమయలో బ్లూ కలర్ కారులో వచ్చిన వ్యక్తులు కర్రలకు కట్టిన ఫ్లెక్సీని 60శాతం మేర చించి కారు డిక్కీలో వేసుకొని కావలి రహదారివైపు వెళ్లినట్లు ఉందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.