AP News: టీడీపీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2022-09-02T17:36:53+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది.
అమరావతి: టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. నేటి పాలకల్లో విద్వేషాలు పెరిగి దాడులకు తెగబడుతున్నారని ఈ సందర్భంగా బాబు అన్నారు. విశాఖపట్నంలో డాక్టర్ సుబ్రహ్మణ్యంతో ఈ విద్వేష దాడులు మొదలయ్యాయని తెలిపారు. అడ్మిస్ట్రేటివి రిఫార్మ్స్ను రాష్ట్రంలో తీసుకువచ్చింది ఎన్టీఆర్ (NTR) అని అన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది కూడా ఎన్టీఆర్ అన్నారు. ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే (TDP Government) అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.