వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారు: సుబ్బారెడ్డి
ABN , First Publish Date - 2022-08-11T06:04:23+05:30 IST
రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని టీడీపీ డోన్ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.
డోన్, ఆగస్టు 10: రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని టీడీపీ డోన్ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని 18, 19 వార్డులలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్చార్జి సుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ప్రజల భవిష్యత్ను అంధాకారం చేసిందని మండిపడ్డారు. మోసపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అన్ని వర్గాల ప్రజలను వంచించిందన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి బజారులో నిలపెట్టిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు. డోన్ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు మూత పడుతుండటంతో కార్మికులకు ఉపాధి లేకుండా దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారన్నారు. సామాన్యులు బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో అన్ని రకాల చార్జీలు, నిత్యావసర ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. డోన్లో వైసీపీ నాయకులు మాఫియా పాలన సాగిస్తూ, అక్రమ సంపాదనలో మునిగి తేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మంత్రి బుగ్గనకు లేదా? అని ప్రశ్నించారు. మంత్రి బుగ్గన అనుచరులు చేస్తున్న అరాచకాలపై ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా అద్యక్షుడు ప్రజా వైద్యశాల మల్లికార్జున పాల్గొన్నారు.