టీడీపీ ప్రజలపక్షం

ABN , First Publish Date - 2021-12-02T05:58:40+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షంగానే ఉంటుందని మాజీమంత్రి పల్లెరఘనాధరెడ్డి పేర్కొన్నారు

టీడీపీ ప్రజలపక్షం
కాజ్‌వేను పరిశీలిస్తున్న మాజీ మంత్రి పల్లె

- మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 1: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షంగానే ఉంటుందని మాజీమంత్రి పల్లెరఘనాధరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరపంచాయతీ పరిధిలోని కోవెల గుట్టపల్లి వద్ద వరదలకు కోతకు గురైన ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల పక్షాన ఉండి వారికి అవసరమైన సేవలు అందించడం తమ బాధ్యతగా భావిస్తామన్నారు. ఇందులో భాగంగానే తాము వరదలకు కొట్టుకు పోయిన కాజ్‌వే సమీపంలో సొంత నిఽధులతో మట్టిని తోలించి చదును చేయంచడం జరిగిందన్నారు. రాయలవారిపల్లి చెక్‌డ్యాం తెగిపోవడంతో ఆగ్రామప్రజలకు  ఊర్లోనుండి బయటకు వెళ్ళలేని పరి స్థితి ఏర్పడిందని వెంటనే చెక్‌డ్యాం మరమ్మతులు వెంటనే చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజాజీవనం సాధారణస్థితికి వచ్చేవరకు ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించాలని, అధికారులు మొద్దునిద్ర వీడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గూడూరు ఓబుళేసు, సామకోటి ఆదినారాయణ,పల్లె వ్యక్తిగత సహా యకుడు శ్రీనాథరెడ్డి, అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T05:58:40+05:30 IST