ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-04-22T16:27:36+05:30 IST

కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి: అచ్చెన్నాయుడు

అమరావతి: కరోనా దెబ్బకు ఉపాధ్యాయుల బతుకులు దుర్భరంగా మారాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు 5 లక్షల మందికిపైగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని తెలిపారు. కరోనా దెబ్బకు స్కూళ్లు మూతపడి ఉపాధ్యాయులు కార్మికులుగా మారారని అన్నారు. అన్నమో రామచంద్రా అంటూ టీచర్లు అలమటిస్తున్నారని వాపోయారు. కరోనా మొదలయ్యాక ఇప్పటి వరకూ  25మంది టీచర్లు మృతి చెందారని...అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలని...రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-04-22T16:27:36+05:30 IST