గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలి: Achennaidu

ABN , First Publish Date - 2021-07-29T19:19:44+05:30 IST

ధాన్యం బకాయిల చెల్లింపు విజయం రోడ్డెక్కిన రైతులదే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలి: Achennaidu

అమరావతి: ధాన్యం బకాయిల చెల్లింపు విజయం రోడ్డెక్కిన రైతులదే అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు జరిగిన వడ్డీ నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం బకాయిలు విడుదల చేయడంలో జగన్ రెడ్డి నెలలు తరబడి ఆలస్యం చేశారన్నారు. టీడీపీ పిలుపు మేరకు అన్నదాతలు ధాన్యం బకాయిల చెల్లింపు కోసం రోడ్డెక్కారని అన్నారు. వ్యవసాయరంగం పట్ల జగన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని విమర్శించారు.  ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి ధాన్యం రైతులు నష్టపోయారన్నారు. జగన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. ఏపీలో రైతులపై రూ.1.69 లక్షల కోట్ల రుణం ఉందని.. గత ప్రభుత్వం వలే రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి, దుబారా అరికడితే రైతు రుణమాఫీ కూడా సాధ్యమే అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-29T19:19:44+05:30 IST