ధూళిపాళ్ల అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-04-23T14:17:20+05:30 IST

ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

ధూళిపాళ్ల అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: అచ్చెన్నాయుడు

అమరావతి: ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ధూళిపాళ్ల అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పిరికిపంద చర్య అని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారనే ధూళిపాళ్లపై కక్ష కట్టారని ఆరోపించారు. అమూల్ కోసమే సంగం డెయిరీని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కరోనా ఉధృతిలో ప్రజారోగ్యాన్ని జగన్ రెడ్డి గాలికొదిలేశారని అన్నారు. ప్రత్యర్థులపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతూ రాక్షసానందం పొందుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

Updated Date - 2021-04-23T14:17:20+05:30 IST