కూలీ పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోడం బాధాకరం: Achennaidu

ABN , First Publish Date - 2022-06-30T15:02:02+05:30 IST

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

కూలీ పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోడం బాధాకరం: Achennaidu

అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achennaidu) అన్నారు. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హైటెన్సన్ విద్యుత్ తీగలు తెగి బస్సుపై పడడంతో ప్రమాదo జరిగిందని... దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు తెలిపారు. 

Updated Date - 2022-06-30T15:02:02+05:30 IST