Achennaidu: వైసీపీ పార్టీ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయండి

ABN , First Publish Date - 2022-08-19T19:50:33+05:30 IST

రాష్ట్రంలో మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు.

Achennaidu: వైసీపీ పార్టీ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయండి

అమరావతి: రాష్ట్రంలో మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ(TDP) రాష్ట్ర అధ్యక్షులు  కింజరాపు అచ్చెన్నాయుడు (Achennaidu) విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... అధికారులు వైసీపీ (YCP) కోసం కాకుండా... ప్రజలు కోసం పనిచేయాలని హితవుపలికారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 27వ వార్డు ఉల్లాసపేట (శ్రీనివాస నగర్)లో 2001లో పట్టాలు ఇచ్చిన స్థలంలో ఇళ్ళు నిర్మించుకొని పేదలు నివాసముంటున్నారని తెలిపారు. స్థానికంగా జరుగుతున్న భూకబ్జాలను ఇక్కడి టీడీపీ (TDP) కౌన్సిలర్ ప్రశ్నిస్తున్నారని, రాజకీయ కక్షతో పేదల ఇళ్ళు పడగొట్టడానికి వచ్చారని తెలిపారు. అక్రమ కూల్చివేతలను అడ్డుకున్న ఒక గౌరవ ఎమ్మెల్యేతో ప్రవర్తించే విధానం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.


పేద ప్రజల పక్షాన, న్యాయం వైపున నిలబడటమే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు (MLA Ashok babu) చేసిన నేరమా అని నిలదీశారు.  ‘‘నాడు దళిత డ్రైవర్‌ను చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ (YCP MLC)కి మీరు చేసిన రాచ మర్యాదలు, నేడు పేదల తరపున నిలబడ్డ టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA)తో మీ ప్రవర్తన అన్నీ ప్రజలు గమనిస్తున్నారు’’ అని అన్నారు. అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు అందరూ కూడా వారి చర్యలకు, భవిష్యత్‌లో న్యాయస్థానాల్లో జవాబు చెప్పాల్సి ఉంటుందని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. 

Updated Date - 2022-08-19T19:50:33+05:30 IST