Achennaidu Comments: జగన్ మూడేళ్లలో కనీసం 3 పరిశ్రమలైనా తెచ్చారా?
ABN , First Publish Date - 2022-08-22T17:10:49+05:30 IST
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు.
అమరావతి: సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy)పై టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Achennaidu) మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ మూడేళ్లలో మూడు పరిశ్రమలైనా తెచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు (Chandrababu naidu) తెచ్చిన పరిశ్రమలను తాను తెచ్చినట్లు జగన్ (CM Jagan) ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని జగన్ ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని ప్రశ్నించారు. ఫ్యాక్టరీలకు భూములిస్తున్నారని చంద్రబాబు (TDP Chief)పై విషప్రచారం చేసిన జగన్ (YCP Chief).. నేడు అదే భూముల్లో జగన్ శంకుస్థాపనలు ఎలా చేస్తున్నారని నిలదీశారు. సీఎం దావోస్ పర్యటన వల్ల ఏపీ (Andhrapradesh)కి కలిగిన ప్రయోజనమేమీ లేదన్నారు. వైసీపీ (YCP) మూడేళ్ల పాలనలో పరిశ్రమలను వెళ్లగొట్టడం, కక్షసాధింపులతో ఇళ్లు పడగొట్టడం తప్ప జగన్ సాధించిందేంటి అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నల వర్షం కురిపించారు.