తాడేపల్లి తాబేదారుల ఒత్తిడి మేరకే ఆర్కేపై కేసు: Achennaidu

ABN , First Publish Date - 2021-12-13T17:35:57+05:30 IST

తాడేపల్లి తాబేదారుల ఒత్తిడి మేరకే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సీఐడీ తప్పుడు కేసు నమోదు చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

తాడేపల్లి తాబేదారుల ఒత్తిడి మేరకే ఆర్కేపై కేసు: Achennaidu

అమరావతి:  తాడేపల్లి తాబేదారుల ఒత్తిడి మేరకే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై సీఐడీ తప్పుడు కేసు నమోదు చేసిందని టీడీపీ రాష్ట్ర  అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కేసులు పెట్టాల్సింది తప్పుల్ని ఎత్తిచూపుతున్న వారిపై కాదని, తప్పులు చేసి తప్పించుకు తిరుగుతున్న జగన్‌పై అని అన్నారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై ఏపీ సీఐడీ ఎఫ్ ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆర్కే ఏం నేరం చేశారని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించారు. తన అవినీతి బురదను అందరికీ అంటించేందుకు జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మిత్రుడు, రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీ నారాయణ నివాసంపై సోదాలకు వెళితే అక్కడికి రావడం రాధాకృష్ణ చేసిన తప్పా అని ప్రశ్నించారు. లక్షీనారాయణతో సీఐడీ అధికారుల సమక్షంలోనే రాధాకృష్ణ మాట్లాడినా ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని ఆయన  నిలదీశారు.


తాడేపల్లి తాబేదారుల నుంచి నుంచి వచ్చిన ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు. దాదాపు 30 గంటల తర్వాత  జీరో ఎప్.ఐ.ఆర్ నమోదు చేయటం ప్రభుత్వ కుట్రలకు నిదర్శనమన్నారు. జగన్ చేసిన తప్పులకు, అవినీతికి జీరో ఎప్.ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్నిపోలీస్ స్టేషన్లలో ఎప్.ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపో‎తాయని యెద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతి సాక్షి తప్పించి మరో మీడియా ఉండేందుకు వీల్లేదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం హేయమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న మీడియాకు ఎన్నాళ్లు సంకెళ్లు వేస్తారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చేస్తున్న ప్రతి తప్పు వైసీపీ పాలనకు ముప్పుగా మారుతుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. 

Updated Date - 2021-12-13T17:35:57+05:30 IST