‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టుగా వైసీపీ నేతల తీరు: Achennaidu

ABN , First Publish Date - 2022-05-02T17:17:42+05:30 IST

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు యధా రాజా తధా ప్రజా అన్నట్టుగా తయారైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు.

‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టుగా వైసీపీ నేతల తీరు: Achennaidu

అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైసీపీ నేతలు, కార్యకర్తల తీరు ‘‘యధా రాజా తధా ప్రజా’’ అన్నట్టుగా తయారైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... పొద్దున్న లేస్తే ఎవరి ఆస్తులు విధ్వంసం చేద్దాం, ఎవరిపై అక్రమ కేసులు పెడదామా అని ‎ ముఖ్యమంత్రి ఆలోచిస్తుంటే... వైసీపీ కార్యకర్తలు మాత్రం ఎవరిపై దాడి చేద్దాం, ఎవరి ప్రాణాలు తీద్దాం, ఎవరి ఆస్తులు లాక్కుందామా అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ గూండాల అరాచకాలకు, ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ కార్యకర్త కానిశెట్టి నాగులు ఇంటిపై వైసీపీ గూండాల దాడిని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. నాగులు కుటుంబ సభ్యులపైనే కాక ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై కూడా దాడి చేశారంటే వైసీపీ గూండాలు పశువుల కన్నా హీనంగా తయారయ్యారని స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. నాగులు ఇంటిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే... అధికార మదంతో అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ రౌడీ మూకలకు రిటర్న్ గిప్ట్ ఇస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2022-05-02T17:17:42+05:30 IST