ప్రభుత్వంపై తిరగబడతాం: అచ్చెన్నాయుడు
ABN , First Publish Date - 2021-07-10T01:29:00+05:30 IST
లేటరైట్ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే గిరిజన సోదరులతో కలిసి ప్రభుత్వంపై
అమరావతి: లేటరైట్ తవ్వకాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే గిరిజన సోదరులతో కలిసి ప్రభుత్వంపై తిరగబడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. లేటరైట్ తవ్వకాల పరిశీలనకు వెళ్లిన టీడీపీ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. లేటరైట్ తవ్వకాలు నిలిపే వరకు టీడీపీ పోరాటం చేస్తుందని అచ్చెన్న తెలిపారు. ఓబుళాపురం మైన్స్ దోచుకోవడంతో మైనింగ్ మాఫియా కింగ్గా జగన్రెడ్డి ఎదిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.