అప్పుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి: Achennaidu

ABN , First Publish Date - 2022-01-18T17:35:46+05:30 IST

ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

అప్పుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి: Achennaidu

అమరావతి: ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా మహానేత విగ్రహానికి అచ్చెన్న, పార్టీ సీనియర్ నేతలు పూలమాలలు వేసి నివాళిఅర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దేశంలో సంక్షేమం అనే పదం పుట్టింది ఎన్టీఆర్, టీడీపీ హయాంలోనే అని అన్నారు. 35 రూపాయలతో పెన్షన్ పథకాన్ని ఆనాడు ప్రారంభించింది ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి జగన్ అనే వైరస్ పట్టిందని వ్యాఖ్యానించారు. జగన్ వైరస్ అతి పెద్ద వైరస్ అని అన్నారు. యువత బయటకి వచ్చి జగన్ వైరస్‌ను తరిమికొట్టాలని.... అప్పుడే ఎన్టీఆర్‌కు ఘన నివాళి అని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌కు కరోనా వచ్చింది అని టీడీపీ కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే ఇద్దరు కోలుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-18T17:35:46+05:30 IST