దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలి: Achennaidu
ABN , First Publish Date - 2021-08-30T17:46:51+05:30 IST
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. సోమవారం ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదికలో ఆయన మాట్లాడుతూ విశాఖలో మెడ్టెక్ జోన్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని.. కరోనా సమయంలో అదే మెడ్టెక్ ప్రాణాలు కాపాడిందని తెలిపారు. టీటీడీ లూలూ గ్రూప్ తీసుకొని వస్తే.. వారిని పంపించేశారన్నారు. ఉత్తరాంధ్ర మంత్రులు సీఎం దగ్గర ఈ ప్రాంత సమస్యలు ప్రస్తావించగలరా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రను వైసీపీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని విమర్శించారు. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీ ఎంపీలు విశాఖ రైల్వేజోన్పై ఎందుకు మాట్లాడరు అని అచ్చెన్నాయుడు నిలదీశారు.