యువతను రౌడీలుగా మారుస్తున్నారు: అఖిలప్రియ
ABN , First Publish Date - 2021-07-31T00:10:21+05:30 IST
రాష్ట్రంలో ఉద్యోగాల పేరుతో యువతను తప్పుదోవ పట్టించి రౌడీలుగా మారుస్తున్నారని
కర్నూలు: రాష్ట్రంలో ఉద్యోగాల పేరుతో యువతను తప్పుదోవ పట్టించి రౌడీలుగా మారుస్తున్నారని ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ధ్వజమెత్తారు. చాగలమర్రిలో నిర్వహించిన సమావేశంలో అఖిల ప్రియ మాట్లాడారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు భూమా కుటుంబం అండగా ఉంటుందని ఆమె తెలిపారు. మద్యం ద్వారా వచ్చే డబ్బులతో ప్రభుత్వం పరిపాలన చేయడం సిగ్గుచేటని అఖిల ప్రియ విమర్శించారు.