బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: రామ్మోహన్

ABN , First Publish Date - 2020-10-26T18:00:58+05:30 IST

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు.

బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: రామ్మోహన్

ఏలూరు: బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్లకు నిధులు లేవని... చైర్మన్లు కూర్చోవడానికి కుర్చీలు లేవని వ్యాఖ్యానించారుు. బీసీల సంక్షేమానికి పాటుబడిన ఘనత,  రాజ్యార్హత కల్పించింది టీడీపీ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. బీసీ మంత్రులు తమ జిల్లాలకే పరిమితం అయ్యారని.. రాష్ట్రంలో ఎక్కడా తిరిగే పరిస్థితి లేదని తెలిపారు. బీసీలకు అన్యాయం చేస్తే జగన్‌కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని రామ్మోహన్ హెచ్చరించారు. 

Updated Date - 2020-10-26T18:00:58+05:30 IST