మూడేళ్లలో జగన్ చేసిన ఒక్క మంచిపని లేదు: Ayyanna

ABN , First Publish Date - 2022-04-23T19:19:47+05:30 IST

మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ఒక్క మంచిపని లేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు.

మూడేళ్లలో జగన్ చేసిన ఒక్క మంచిపని లేదు: Ayyanna

అమరావతి: మూడేళ్లలో ముఖ్యమంత్రి జగన్ చేసిన ఒక్క మంచిపని లేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ బయటకు వచ్చి ప్రజాసమస్యలు స్వయంగా చూసింది లేదన్నారు. అప్పుడు రావాలి జగన్ అన్నారు.. ఇప్పుడు పోవాలి జగన్ అంటున్నారని అన్నారు. తల్లికి బర్త్‌డే విషెస్ చేయని దుర్మార్గుడు జగన్‌ అని మండిపడ్డారు. సొంత చెల్లెలిని తరిమేసిన స్వార్థపరుడు జగన్‌ అని అన్నారు. బాబాయ్ హత్య కేసులో జగన్‌పై ఆరోపణలు ఉన్నాయని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-23T19:19:47+05:30 IST