భూములు తాకట్టు పెట్టొద్దు: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2021-06-12T17:23:48+05:30 IST

కాసుల కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టవద్దని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు

భూములు తాకట్టు పెట్టొద్దు: అయ్యన్నపాత్రుడు

 విశాఖ: కాసుల కోసం ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టవద్దని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ప్రభుత్వానికి సూచించారు. కాసుల కోసం సర్కారు బరితెగింపు చర్యలకు దిగడం దారుణమని అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విశాఖలో 213 ఎకరాల ప్రభుత్వ భూములను 1600 కోట్లకు తాకట్టు పెట్టడం దారుణమని ఆయన ఆరోపించారు.  విశాఖను విజయసాయిరెడ్డి సర్వనాశనం చేస్తున్నారని అయ్యన్న ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్‌కు అవగాహన లేదని అయ్యన్న ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడం చేతకాక, దుబారా ఖర్చులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అయ్యన్నపాత్రుడు  ఆరోపించారు. 


Updated Date - 2021-06-12T17:23:48+05:30 IST