ఖాకీ తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలి: అయ్యన్నపాత్రుడు
ABN , First Publish Date - 2021-09-09T02:59:26+05:30 IST
గుంటూరు రూరల్ ఎస్పీపై టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో
గుంటూరు: గుంటూరు రూరల్ ఎస్పీపై టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీకి చిన్నపాలేరులా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడటం ఐపీఎస్కే కళంకమన్నారు. అంత సరదాగా ఉంటే ఖాకీ తీసేసి వైసీపీ కండువా కప్పుకోవాలని రూరల్ ఎస్పీకి అయ్యన్నపాత్రుడు సూచించారు. కనీసం పోలీసు వ్యవస్థపై గౌరవమైనా నిలబడుతుందన్నారు. రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి లోకేష్ వస్తే మీరంతా దగ్గర ఉండి వైసీపీ నాయకులను ఉసిగొల్పిన విషయం మర్చిపోయారా అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. మహిళల ప్రాణాలంటే మీకు ఎలాగూ లెక్క లేదన్నారు. కనీసం వేసుకున్న ఖాకీ చొక్కాకైనా గౌరవం ఇవ్వండని ఎస్పీకి అయ్యన్నపాత్రుడు హితవు పలికారు.