చంద్రబాబు పేరు వింటేనే వైసీపీకి వెన్నులో వణుకు: బోండా ఉమా

ABN , First Publish Date - 2021-03-01T16:27:45+05:30 IST

చంద్రబాబు పేరు వింటేనే వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని...చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవటమే నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు బోండా ఉమా అన్నారు.

చంద్రబాబు పేరు వింటేనే వైసీపీకి వెన్నులో వణుకు: బోండా ఉమా

అమరావతి: చంద్రబాబు పేరు వింటేనే వైసీపీకి వెన్నులో వణుకు పుడుతోందని... చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవటమే నిదర్శనమని టీడీపీ పొలిట్ బ్యూర్ సభ్యులు బోండా ఉమా అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా పోలీసుల జోక్యం ఏంటి అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ అరాచకాలు బట్టబయలు అవుతుందనే చంద్రబాబును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేదే లేదన్నారు. పోలీసులు వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నరని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రచారం కూడా చేయనీయడం లేదు అంటే టీడీపీకి వైసీపీ ఎంత భయపడుతోంది అర్థమవుతోందన్నారు. తిరుపతిలో జరుగుతున్నఅరాచకాలు. అభ్యర్థుల బెదిరింపులు లేకపోతే చంద్రబాబు పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని బోండా ఉమా నిలదీశారు. 

Updated Date - 2021-03-01T16:27:45+05:30 IST