Andhra news: కేసీ నారాయణ మృతి బాధాకరం: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-07-22T15:30:31+05:30 IST
అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేసీ నారాయణ మృతి బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి: అనంతపురం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేసీ నారాయణ(KC narayana) మృతి బాధాకరమని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. నారాయణ పార్టీకి అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానూభూతి తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని పార్థిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.