
అమరావతి: వైసీపీ చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న తెలుగుదేశం నేతల అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu naidu) ఖండించారు. ఆసుప్రత్రి నుంచి మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా? అని ప్రశ్నించారు. మృతునికి సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా బంధువులకు ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారన్నారు. హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి