దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలి: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-23T14:58:15+05:30 IST

అక్రమంగా అరెస్ట్ చేసి సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

దూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలి: చంద్రబాబు

అమరావతి: అక్రమంగా అరెస్ట్ చేసిన సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సంగం డైరీని దెబ్బతీసి అమూల్‌కు కట్టబెట్టే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ధూళిపాళ్ల నరేంద్ర అక్రమ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. స్థానిక రైతులు భాగస్వామిగా ఉండే సంగం డైరీని నిర్వీర్యం చేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన అమూల్‌తో లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని ఇక్కడి సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల పాలనలో అభివృద్ధి లేదు కానీ.. అక్రమ అరెస్ట్‌లు మాత్రం ఉంటున్నాయన్నారు. ప్రజా సమస్యలు బయటకు వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు వంటి నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కరోనా నియంత్రణలో విఫలమవడంతో ప్రజలను పక్కదారి పట్టించడానికే టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలని అన్నారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అక్రమ అరెస్ట్‌లు చేయించుకుంటూ పోతే రాష్ట్రంలో ఎవరూ మిగలరని జగన్ రెడ్డి గుర్తించాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. 

Updated Date - 2021-04-23T14:58:15+05:30 IST