దేవినేని శ్రీమన్నారాయణ భౌతికకాయానికి Chandrababu నివాళి

ABN , First Publish Date - 2021-12-03T19:13:29+05:30 IST

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ భౌతికకాయానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

దేవినేని శ్రీమన్నారాయణ భౌతికకాయానికి Chandrababu నివాళి

విజయవాడ: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ భౌతికకాయానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఆపై దేవినేని కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేవినేని వెంకటరమణ కుమార్తె ప్రజ్ఞనను బాబు పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ అధినేత మాట్లాడుతూ... శ్రీమన్నారాయణ మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. గత నెల రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతు నిన్న రాత్రి మరణించారని తెలిపారు. శ్రీమన్నారాయణ ఎంతో కష్టపడి పైకొచ్చారని, పిల్లల్ని కూడా ఎంతగానో  తీర్చి దిద్దారని కొనియాడారు. శ్రీమన్నారాయణ కుమారుల్లో ఒకరు దేవినేని రమణ అని అన్నారు. రమణ మంచి డైనమిక్‌ లీడర్‌ అని తెలిపారు. విధి వక్రీకరించడంతో రమణ ఒక ట్రైన్‌ యాక్సిడెంట్‌లో చనిపోవడం ఒక దురదృష్టమని ఆవేదన చెందారు. ఆయన కోసమే ట్రైన్‌ యాక్సిడెంట్‌ జరిగిందా... అని అనిపించిందన్నారు. శ్రీమన్నారాయణ కుటుంబ సభ్యులకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేవినేని కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. 

Updated Date - 2021-12-03T19:13:29+05:30 IST