తప్పుడు ప్రచారాలతో పార్టీకే నష్టం : టీడీపీ నేత
ABN , First Publish Date - 2022-05-01T12:21:16+05:30 IST
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఆపకపోతే..
ఏలూరు జిల్లా/నూజివీడు : సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఆపకపోతే పార్టీ నష్టపోక తప్పదని దీనిపై తాను టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్, రావిచర్ల సర్పంచ్ కాపా శ్రీనివాసరావు అన్నారు. తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు తనపై, తన గ్రామానికి సంబంధించిన వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలా చేస్తున్న వారు ముద్దరబోయిన ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎంత వరకు కృషి చేశారో తెలుసుకోవాలన్నారు. 2005లో పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితులై సుమారు 10 ఏళ్లు మండలంలో పార్టీని అధికారంలో నిలిపానన్నారు.