ఏపీలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణం: Devathoti

ABN , First Publish Date - 2022-04-29T14:41:08+05:30 IST

రాష్ట్రంలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు.

ఏపీలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణం: Devathoti

అమరావతి: రాష్ట్రంలో మహిళల పరిస్థితి బ్రిటిష్ హయాం కంటే దారుణంగా ఉందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్తున్న లోకేష్ కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణుల రాళ్ల దాడి పిరికిపంద చర్య అని అన్నారు. లోకేష్‌ను ప్రజాస్వామికంగా ఎదుర్కోలేకే, మానసికంగా బలహీనపరచడం కోసం.. భౌతికంగా రాళ్ల దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజాహితం కోసం పనిచేసే లోకేష్‌ను వైసీపీ రౌడి మూఖల చిల్లర దాడులు ఏమీ చేయలేవని తెలిపారు. చంద్రబాబు హయాంలో మహిళలు అభివృద్ధి పధంలో నడిస్తే  జగన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు బాధితులుగా మిగిలిపోతున్నారని దేవతోటి నాగరాజు అన్నారు. 

Updated Date - 2022-04-29T14:41:08+05:30 IST