AP news: జగన్ రెడ్డి.. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం: దేవతోటి
ABN , First Publish Date - 2022-07-22T14:50:20+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan mohan reddy)పై టీడీపీ(TDP) రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏరియల్ సర్వే పేరుతో గాలిలో చెక్కర్లు కొట్టి వరద బాధితులను పరామర్శించకుండా..ఏ సహాయం ప్రకటించకుండా చేతులు దులిపేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) బాధ్యతయుతగల నేత, వరద బాధితులను స్వయంగా కలిసి వారి బాధలను తెలుసుకొని పరిష్కార మార్గాలు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. జగన్ రెడ్డి "ఏరు దాటాక తెప్ప తగలేసే రకం". ఆయన ప్రవర్తనను ప్రజలు ఇప్పటికైనా గుర్తించాలి’’ అని దేవతోటి నాగారాజు పేర్కొన్నారు.