Devathoti Nagaraju: టీడీపీ శాంతియుత ధర్నాలను అడ్డుకోవడం దారుణం: దేవతోటి
ABN , First Publish Date - 2022-07-26T16:27:16+05:30 IST
వైసీపీ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ స్కీంల అమలు కోసం తెలుగు దేశం పార్టీ నిర్వహించే శాంతియుత ధర్నాలను వైసిపి ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు మండిపడ్డారు.
అమరావతి: వైసీపీ రద్దు చేసిన 27 ఎస్సీ సంక్షేమ స్కీంల అమలు కోసం తెలుగు దేశం పార్టీ(TDP) నిర్వహించే శాంతియుత ధర్నాలను వైసీపీ ప్రభుత్వం(YCP Government) అడ్డుకోవడం దారుణమని టీడీపీ (TDP) రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు(Devathoti nagaraju) మండిపడ్డారు. ఎస్సీలకు న్యాయంగా ఉన్న 27 స్కీంలను రద్దు చేయకపోతే అసలు ధర్నాలే ఉండవు కదా అని అన్నారు. 27 ఎస్సీ స్కీంలను రద్దు చేయడం, వాటి కోసం ఉద్యమిస్తున్న వారిని అరెస్ట్ చేయడం చూస్తూంటే వైసీపీ విధానం దళిత వ్యతిరేక విధానం అని స్పష్టంగా అర్థమవుతోందని దేవతోటి నాగరాజు పేర్కొన్నారు.